కరోనా కేసుల నమోదుకు భారత్‌కు జాతీయ విధానం కావాలి: డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-07-05T13:42:48+05:30 IST

కరోనా దీర్ఘకాలం పాటు వెంటాడే సంక్షోభమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు.

కరోనా కేసుల నమోదుకు భారత్‌కు జాతీయ విధానం కావాలి: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా/న్యూఢిల్లీ, జూలై 4: కరోనా దీర్ఘకాలం పాటు వెంటాడే సంక్షోభమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కరోనా కేసుల సమాచారం నమోదుకు భారత్‌ జాతీయ విధానం రూపొందించుకోవాలని సూచించారు. లేకుంటే ఒక్కో రాష్ట్రం ఒక్కోలా కొవిడ్‌ కేసుల వివరాలను ప్రకటించి గందరగోళానికి దారి తీస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో వ్యాధి సంక్రమణ ఎలా జరుగుతోందో తెలుసుకోవడంపై దృష్టిసారించాలని భారత్‌ను కోరారు. ఎక్కడ, ఎన్ని కేసులు నమోదవుతున్నాయనే విషయాన్ని నిర్ధారణ పరీక్షల వివరాలు ప్రాతిపదికగా సేకరించాలన్నారు.

Updated Date - 2020-07-05T13:42:48+05:30 IST