ఆరు వికెట్లను కోల్పోయిన టీమిండియా...స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-12-04T17:00:24+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 221/4 తో ప్రారంభించిన టీమిండియాకు రెండో రోజు 2వ ఓవర్‎లోనే గట్టి షాక్

ఆరు వికెట్లను కోల్పోయిన టీమిండియా...స్కోర్ ఎంతంటే..

ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 221/4 తో ప్రారంభించిన టీమిండియాకు రెండో రోజు 2వ ఓవర్‎లోనే గట్టి షాక్ తగిలింది. అజాజ్ పటేల్ వేసిన 72వ ఓవర్‎లో వరుస బంతుల్లో టీమిండియా వికెట్లను కోల్పోయింది. సాహా (67), రవిచంద్రన్ అశ్విన్ (0)లు పెవిలియన్ అజాజ్ పెవిలియన్ పంపించాడు. దీంతో భారత్ 72 ఓవర్లకు 6 వికెట్లను కోల్పోయి 224 రన్స్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మయాంక్ అగర్వాల్‎కు తోడుగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‎లో 90 ఓవర్లు ఆటను పూర్తి చేసుకుంది. మయాంక్ అగర్వాల్ (144), అక్షర్ పటేల్ (28) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 95 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లను కోల్పోయి 275 పరుగులు చేసింది.

Updated Date - 2021-12-04T17:00:24+05:30 IST