స్వగ్రామానికి ఒలింపిక్ విజేత చానూ... బీఎస్ఎఫ్ జవాన్లను కలసి...
ABN , First Publish Date - 2021-08-01T14:57:44+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రజిత పతకాన్ని...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రజిత పతకాన్ని తీసుకువచ్చిన మీరాబాయి చానూ మన దేశ సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో విజేతగా నిలిచిన చానూ గతవారమే టోక్యో నుంచి భారత్కు తిరిగి వచ్చారు. ఆమె తాజాగా మణిపూర్లోని ఇంఫాల్లో గల తన స్వగ్రామమైన నాంగ్పాక్ వచ్చారు. ఇక్కడికి సమీపంలోని సీఈఓ పోస్టు దమోదర్ను సందర్శించారు. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకుని వారితో కాసేపు సంభాషించారు.