India: మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-26T16:27:33+05:30 IST

దేశంలో గడచిన 24 గంటల్లో 39,361 కరోనా కేసులు నమోదైనాయి.

India: మళ్లీ పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడచిన 24 గంటల్లో 39,361 కరోనా కేసులు నమోదైనాయి. కరోనా కేసుల సంఖ్య ఆదివారం నుంచి సోమవారానికి 3.41 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో కరోనాతో 416 మంది మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 3,14,11,262కు పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,20,967 మంది మరణించారు. సోమవారం 35,968 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 97.35గా నమోదైంది. దేశం మొత్తంమీద 43,51,96,001 మందికి కొవిడ్ టీకాలు వేశారు.


Updated Date - 2021-07-26T16:27:33+05:30 IST