కరాచీ ఉగ్రదాడికి భారత్దే బాధ్యత: ఇమ్రాన్
ABN , First Publish Date - 2020-07-01T08:41:14+05:30 IST
కరాచీ ఉగ్రదాడికి భారత్దే బాధ్యత అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. మంగళవారం పార్లమెంటులో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. ‘ముంబైలో చేసిన దాన్నే పాక్లోనూ...
ఇస్లామాబాద్, జూన్ 30: కరాచీ ఉగ్రదాడికి భారత్దే బాధ్యత అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. మంగళవారం పార్లమెంటులో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. ‘ముంబైలో చేసిన దాన్నే పాక్లోనూ వారు (భారత్) చేయాలనుకొన్నారు. కరాచీ ఉగ్రదాడిని భారతే చేసిందనడానికి మేము సందేహించం’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.