సిడ్నీ టెస్ట్.. తృటిలో పంత్ సెంచరీ మిస్..
ABN , First Publish Date - 2021-01-11T14:26:25+05:30 IST
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ మిస్ అయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు...
సిడ్నీ: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ మిస్ అయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 రన్స్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. అనవసరపు షాట్కు ప్రయత్నించి పంత్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. లియాన్ వేసిన 80 ఓవర్లో ఫస్ట్ బాల్కే భారీ షాట్ ఆడబోయి గల్లిలో ఉన్న కమిన్స్కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 250 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి, పుజారా 196 బంతుల్లో 11 ఫోర్లతో 71 రన్స్ తో కొనసాగుతున్నారు. భారత్ మూడో టెస్ట్లో విజయం సాధించాలంటే ఇంకా 143 పరుగులు చేయాల్సింది.