టూరు..ఖరారు!

ABN , First Publish Date - 2020-05-28T08:56:11+05:30 IST

కరోనా వైర్‌సతో జరుగుతుందో..లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని క్రికెట్‌ ...

టూరు..ఖరారు!

ఆసీ‌స్ లో భారత్‌ పర్యటన యధాతథం

రేపు ప్రకటించనున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా


మెల్‌బోర్న్‌: కరోనా వైర్‌సతో జరుగుతుందో..లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)  సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సీజన్‌లో భారత్‌ సహా ఐదు జట్లతో ఆసీస్‌ తలపడనుంది. అయితే కోహ్లీసేనకు క్వారంటైన్‌ ఉండదని సమాచారం. అలాగే బయోసెక్యూర్‌ విఽధానాలు కూడా ఉండబోవని తెలిసింది. ఈ ఏడాది చివర్లో జరిగే ఆ టూర్‌లో ఆసీ్‌సతో నాలుగు టెస్ట్‌ల్లో భారత్‌ ఆడనుంది. 

ఇదీ షెడ్యూల్‌: డిసెంబరు 3న జరిగే తొలి టెస్ట్‌కు బ్రిస్బేన్‌ ఆతిథ్యమివ్వనుంది. అడిలైడ్‌లో రెండో టెస్ట్‌ (డిసెంబరు 11 నుంచి)ను డే/నైట్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. బాక్సింగ్‌ డే టెస్ట్‌ మెల్‌బోర్న్‌ (డిసెంబరు 26 నుంచి)లో జరగనుండగా.. కొత్త ఏడాది (జనవరి 3 నుంచి)లో జరిగే మ్యాచ్‌కు సిడ్నీ వేదిక కానుంది. 

Updated Date - 2020-05-28T08:56:11+05:30 IST