భారత్‌ X ఇంగ్లండ్‌

ABN , First Publish Date - 2020-03-04T09:47:41+05:30 IST

మహిళల టీ20 ప్రపంచక్‌పలో సెమీఫైనల్స్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి టైటిల్‌పై కన్నేసిన భారత జట్టు పటిష్ఠ ఇంగ్లండ్‌ను ఎదుర్కోబోతోంది. 2018 టోర్నీలోనూ ఇదే ప్రత్యర్థితో తలపడిన హర్మన్‌ప్రీత్‌ సేనకు ఓటమి ఎదురైంది

భారత్‌ X ఇంగ్లండ్‌

  • దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా జూ సెమీస్‌ బెర్త్‌లు ఖరారు


సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచక్‌పలో సెమీఫైనల్స్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి టైటిల్‌పై కన్నేసిన భారత జట్టు పటిష్ఠ ఇంగ్లండ్‌ను ఎదుర్కోబోతోంది. 2018 టోర్నీలోనూ ఇదే ప్రత్యర్థితో తలపడిన హర్మన్‌ప్రీత్‌ సేనకు ఓటమి ఎదురైంది. మంగళవారం జరగాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ కారణంగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల మధ్య టాస్‌ కూడా వీలుకాకపోవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు. గ్రూప్‌-బి నుంచి దక్షిణాఫ్రికా (7) టాప్‌నకు చేరగా ఇంగ్లండ్‌ (6) రెండోస్థానంతో సరిపెట్టుకుంది. దీంతో గ్రూప్‌-ఎ టాపర్‌ భారత్‌తో ఇంగ్లండ్‌ సెమీస్‌ పోరు ఖాయమైంది. గ్రూప్‌-ఎలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. ఈ రెండు సెమీస్‌లు గురువారం సిడ్నీలోనే జరుగుతాయి. సెమీస్‌ కూడా వర్షం కారణంగా రద్దయితే తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌, దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరతాయి. 

థాయ్‌లాండ్‌ జోరు: గ్రూప్‌-బిలో జరిగిన పాక్‌-థాయ్‌లాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా జరగలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 150/3 స్కోరు చేసింది. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

Updated Date - 2020-03-04T09:47:41+05:30 IST