మొతేరా టెస్ట్: టీమిండియా ఆలౌట్
ABN , First Publish Date - 2021-03-06T16:50:24+05:30 IST
మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది.
అహ్మదాబాద్: మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 294/7 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 365 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్సులో 160 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. వాషింగ్టన్ సుందర్ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. 174 బంతులు ఆడిన 10 ఫోర్లు, ఒక సిక్స్తో 96 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రనౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మ, సిరాజ్ డకౌట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, బెన్ స్టోక్స్ 4 వికెట్లు, జాక్ లీచ్ ఒక వికెట్ తీసుకున్నారు.