ఇండియా-ఇంగ్లండ్ టీ20: పంత్ అవుట్

ABN , First Publish Date - 2021-03-13T01:48:44+05:30 IST

తొలి టీ20లో టీమిండియా పట్టు కోల్పోతోంది. బ్యాట్స్‌మెన్ దారుణ ప్రదర్శనతో కేవలం 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్(1) వికెట్ కోల్పోయింది. ఆ తరువాతి..

ఇండియా-ఇంగ్లండ్ టీ20: పంత్ అవుట్

అహ్మదాబాద్: తొలి టీ20లో టీమిండియా పట్టు కోల్పోతోంది. బ్యాట్స్‌మెన్ దారుణ ప్రదర్శనతో కేవలం 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్(1) వికెట్ కోల్పోయింది. ఆ తరువాతి ఓవర్లో కెప్టెన్ కోహ్లీ(0) డకౌట్‌గా వెనుతిరగి మరోసారి నిరాశపరిచాడు. అయితే ఫాంలో ఉన్న రిషబ్ పంత్ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడింపించాడు. కానీ 21 పరుగుల వద్ద స్టోక్స్ వేసిన స్లో బాల్‌ను భారీ షాట్ ఆడబోయి మిడ్ వికెట్‌లో బెయిర్ స్టోకు చిక్కాడు. దీంతో భారత్ 4వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-03-13T01:48:44+05:30 IST