WT20: వికెట్ పడకుండానే పాక్ ఛేజింగ్.. 15 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..
ABN , First Publish Date - 2021-10-25T04:17:35+05:30 IST
టీమిండియాపై పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. వికెట్ పడకుండా టార్గెట్ ఛేజింగ్కు చేరువవుతోంది. టీ20 ప్రపంచకప్లో..
దుబాయ్: టీమిండియాపై పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. వికెట్ పడకుండా టార్గెట్ ఛేజింగ్కు చేరువవుతోంది. టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్(56 నాటౌట్: 44 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్స్), బాబార్ అజామ్(62 నాటౌట్: 46 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్స్) విజృంభించి ఆడుతున్నారు. భారత బౌలర్ల బౌలింగ్ను చిత్తుగా బాదేస్తున్నారు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ పడకుండా 121 పరుగులు చేసింది. విజయం కోసం మరో 30 బంతుల్లో 31 బంతులు మాత్రమే చేయాల్సి ఉంది.