India vs Sri Lanka: తగ్గిన వర్షం.. 47 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
ABN , First Publish Date - 2021-07-23T23:59:38+05:30 IST
వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం
కొలంబో: వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడడంతో 47 ఓవర్లకు కుదించారు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 22, మనీష్ పాండే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. పృథ్వీషా 49, సంజు శాంసన్ 46 పరుగులు చేసి అవుటవగా కెప్టెన్ శిఖర్ ధవన్ 13 పరుగులు మాత్రమే చేశాడు. శ్రీలంక బౌలర్లలో చమీర, జయవిక్రమ, షనక చెరో వికెట్ తీసుకున్నారు.