ఇంగ్లండ్ టూర్కు భారత అమ్మాయిలు
ABN , First Publish Date - 2021-04-14T08:55:09+05:30 IST
భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్-జులై మాసాల్లో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో భారత్ ఒక టెస్ట్తోపాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది..
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్-జులై మాసాల్లో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో భారత్ ఒక టెస్ట్తోపాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. 2014 తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనుండడం టీమిండియాకిదే తొలిసారి. చివరిసారిగా భారత జట్టు దక్షిణాఫ్రికాతో మైసూరులో టెస్ట్ ఆడింది. ఇంగ్లండ్ కూడా 2019 యాషెస్ సిరీస్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతోంది. ఇక ఏకైక టెస్ట్ జూన్ 16-19 తేదీల్లో, వన్డేలు జూన్ 27, 30, జులై 3 తేదీల్లో, అలాగే టీ-20 మ్యాచ్లు జులై 9, 11, 15 తేదీల్లో జరుగుతాయి.