అప్పటిదాకా సోషల్మీడియాకు గుడ్బై
ABN , First Publish Date - 2021-03-02T06:59:34+05:30 IST
టోక్యో ఒలింపిక్స్కు సన్నద్ధమవుతున్న భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియా సోషల్మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్లో సోమవారం వెల్లడించాడు...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు సన్నద్ధమవుతున్న భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియా సోషల్మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్లో సోమవారం వెల్లడించాడు. ‘నా సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ మూసివేస్తున్నా. ఇక టోక్యో ఒలింపిక్స్ తర్వాతే మిమ్మల్ని కలుస్తా. మీరంతా ఎప్పటిలాగే నాపై ప్రేమాభిమానాలు చూపుతారని ఆశిస్తున్నా. జై హింద్’ అని బజ్రంగ్ ట్వీట్ చేశాడు.