కువైట్‌లోని మ‌హిళా లేబ‌ర్ షెల్ట‌ర్‌ను సంద‌ర్శించిన భార‌త‌ రాయ‌బారి

ABN , First Publish Date - 2021-06-17T14:16:52+05:30 IST

భార‌త‌ రాయ‌బారి సిబి జార్జ్ బుధ‌వారం గృహా కార్మికుల కోసం కువైట్ ప్ర‌భుత్వం న‌డుపుతున్న మ‌హిళా లేబ‌ర్ షెల్ట‌ర్‌ను సంద‌ర్శించారు.

కువైట్‌లోని మ‌హిళా లేబ‌ర్ షెల్ట‌ర్‌ను సంద‌ర్శించిన భార‌త‌ రాయ‌బారి

కువైట్ సిటీ: భార‌త‌ రాయ‌బారి సిబి జార్జ్ బుధ‌వారం గృహా కార్మికుల కోసం కువైట్ ప్ర‌భుత్వం న‌డుపుతున్న మ‌హిళా లేబ‌ర్ షెల్ట‌ర్‌ను సంద‌ర్శించారు. రాయ‌బారికి డిప్యూటీ డైరెక్ట‌ర్ ఫ‌ర్ మ్యాన్‌ప‌వ‌ర్ ప్రొటెక్ష‌న్ ముబార‌క్ అల్ అజ్మీ, షెల్ట‌ర్ హెడ్ హ‌మౌద్ అల్ దిహాని, ఇత‌ర సంబంధిత అధికారులు ఆహ్వానం అందించారు. వారితో రాయ‌బారి కొద్దిసేపు ముచ్చ‌టించారు. ప్ర‌స్తుతం ఈ షెల్ట‌ర్‌లో ఒకే ఒక భార‌త మ‌హిళా కార్మికురాలు ఉన్న‌ట్లు, వెంట‌నే ఆమెను కూడా స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామ‌ని రాయ‌బారి సిబి జార్జ్ తెలిపారు. అలాగే ఇటీవ‌ల రాయ‌బారి భార‌త ఎంబ‌సీ న‌డుపుతున్న షెల్ట‌ర్‌ను కూడా సంద‌ర్శించారు. ఈ షెల్ట‌ర్‌లో ప్ర‌స్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నార‌ని, కొన్ని రోజుల ముందు వ‌ర‌కు 100 మంది వ‌ర‌కు ఉండేవార‌ని అంద‌రినీ వారివారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి స్వ‌దేశానికి పంపించ‌డం జ‌రిగింద‌న్నారు. 

Updated Date - 2021-06-17T14:16:52+05:30 IST