సిన్సినాటి మేయర్ బరిలో భారత సంతతి వ్యక్తి!
ABN , First Publish Date - 2021-01-17T15:14:42+05:30 IST
భారతీయ అమెరికన్ లాయర్, డెమోక్రటిక్ నేత అఫ్తాబ్ పురెవాల్కు సిన్సినాటి మేయర్ అభ్యర్థిత్వం ఖరారైంది.
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ లాయర్, డెమోక్రటిక్ నేత అఫ్తాబ్ పురెవాల్కు సిన్సినాటి మేయర్ అభ్యర్థిత్వం ఖరారైంది. అఫ్తాబ్ ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హామిల్టన్ కౌంటీ కోర్టు క్లర్క్గా పనిచేస్తున్నారు. అమెరికాలోని పెద్ద నగరాలలో ఒకటైన సిన్సినాటిలో కరోనా వల్ల అస్తవ్యస్తమైన ప్రజల స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అఫ్తాబ్ హామీ ఇచ్చారు. "ప్రస్తుతం దేశం కఠిన పరిస్థితిలో ఉంది. అలాగే సిన్సినాటి కూడా. కనుక మేయర్ అభ్యర్థిగా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు వాటి ఫలితాలను ప్రతి పౌరుడికి అందేలా చూస్తాను. కరోనాతో దెబ్బతిన్న ప్రజలకు ఆర్థిక సాయం అందడం వల్ల ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది." అని అఫ్తాబ్ అన్నారు. కాగా, అఫ్తాబ్ పేరెంట్స్ 1980లో భారత్ నుంచి ఒహియోలోని జెనియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇక 2018లో యూఎస్ కాంగ్రెస్కు పోటీ చేసిన అఫ్తాబ్ ఓటమి చవిచూశారు.