లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకుల కీలక నిర్ణయం..?

ABN , First Publish Date - 2020-03-27T00:36:44+05:30 IST

కరోనా కట్టడికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో...

లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకుల కీలక నిర్ణయం..?

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం దిశగా బ్యాంకులు అడుగులేస్తున్నట్లు తెలిసింది. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ బ్యాంకు సేవలు ఆగలేదు. ఇప్పటికే పనివేళలు తగ్గించిన బ్యాంకులు తాజాగా కొన్ని బ్రాంచుల్లో మాత్రమే సేవలందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


కొన్ని బ్రాంచులను మూసివేయాలనే యోచనలో బ్యాంకులు ఉన్నట్లు బ్యాంకు యూనియన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనివల్ల కరోనా సోకే అవకాశం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మాత్రమే సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-03-27T00:36:44+05:30 IST