వరల్డ్ చాంపియన్కు జ్యోతి షాక్
ABN , First Publish Date - 2021-02-25T09:26:17+05:30 IST
స్టాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ జ్యోతి గులియా రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నాజిమ్ కైజైబీ (కజకిస్థాన్)కి షాకిచ్చి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది...
సోఫియా (బల్గెరియా): స్టాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ జ్యోతి గులియా రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నాజిమ్ కైజైబీ (కజకిస్థాన్)కి షాకిచ్చి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండోరౌండ్లో జ్యోతి (51 కిలోలు) 3-2తో కైజైబీపై గెలుపొందింది. క్వార్టర్స్లో లాక్రామియోరా (రొమేనియా)తో జ్యోతి తలపడనుంది.