మా క్వారంటైన్‌ పూర్తయిందోచ్‌!

ABN , First Publish Date - 2020-10-29T09:13:19+05:30 IST

మహిళల ఐపీఎల్‌ ఆడేందుకు యూఏఈ వెళ్లి క్వారంటైన్‌లో ఉన్న భారత క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, రాధా యాదవ్‌, హర్లీన్

మా క్వారంటైన్‌ పూర్తయిందోచ్‌!

దుబాయ్‌: మహిళల ఐపీఎల్‌ ఆడేందుకు యూఏఈ వెళ్లి క్వారంటైన్‌లో ఉన్న భారత క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, రాధా యాదవ్‌, హర్లీన్‌ డియోల్‌ ట్విటర్‌లో సరదాగా ఓ వీడియో పోస్ట్‌ చేశారు. గతవారమే దుబాయ్‌ చేరుకున్న వీరు ఏడు రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. బుధవారంతో క్వారంటైన్‌ ముగియడంతో క్రికెటర్లంతా హోటల్‌ లాన్‌లో సరదాగా గడిపారు. హర్లీన్‌ డ్యాన్స్‌ చేస్తుండగా తీసుకున్న సెల్ఫీ వీడియోను జెమీమా పోస్ట్‌ చేసింది. ఈ వీడియోకు ‘ఎండ్‌ ఆఫ్‌ క్వారంటైన్‌’ అనే ట్యాగ్‌లైన్‌ జోడించింది.

Updated Date - 2020-10-29T09:13:19+05:30 IST