స్వదేశానికి రావాలనుకుంటున్న ప్రవాసుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

ABN , First Publish Date - 2020-10-30T14:49:05+05:30 IST

కరోనా లాక్‌డౌన్ వల్ల కువైట్‌లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులు ఎవరైతే రిపాట్రియేషన్ విమానాల్లో స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారి కోసం ఇండియన్ ఎంబసీ మరోసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

స్వదేశానికి రావాలనుకుంటున్న ప్రవాసుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

కువైట్ సిటీ: కరోనా లాక్‌డౌన్ వల్ల కువైట్‌లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులు ఎవరైతే రిపాట్రియేషన్ విమానాల్లో స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారి కోసం ఇండియన్ ఎంబసీ మరోసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. https://forms.gle/R12a8XDxYXfroXUaA లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రాయబార కార్యాలయం పేర్కొంది. వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటికే చాలా మందిని స్వదేశానికి తరలించగా... ఇంకా భారత్‌కు వెళ్లాలని అనుకుంటున్న వారు కువైట్‌లో ఎంత మంది ఉన్నారో ఓ అంచనాకు వచ్చేందుకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దోహదపడుతుందని ఎంబసీ తెలిపింది. ఈ ప్రక్రియ నవంబర్ 5 వరకు ఉంటుందని ఎంబసీ అధికారులు వెల్లడించారు. గడువులోపు స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న ప్రవాసులు పైన పేర్కొన్న లింకు ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.  

Updated Date - 2020-10-30T14:49:05+05:30 IST