హెల్త్కేర్ వర్కర్ల కోసం.. ఖతార్లోని భారత ఎంబసీ ప్రత్యేక సర్వీస్
ABN , First Publish Date - 2021-04-16T15:42:06+05:30 IST
ఖతార్లోని భారత హెల్త్కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యతనిస్తూ భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఆన్లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని ప్రారంభించింది.
దోహా: ఖతార్లోని భారత హెల్త్కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యతనిస్తూ భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఆన్లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని ప్రారంభించింది. ఈ మేరకు భారత ఎంబసీ గురువారం ట్వీట్ చేసింది. హెల్త్కేర్ వర్కర్లకు పాస్పోర్టు, పీసీసీ, ఇతర అటెస్టేషన్ సర్వీసులను ఈ ఆన్లైన్ అపాయింట్మెంట్ విధానం ద్వారా అందించనున్నట్లు తన ట్వీట్లో పేర్కొంది. తాము కోరుకున్న సమయంలో ప్రత్యేక ప్రాతిపదికన హెల్త్కేర్ వర్కర్లకు ఎంబసీ సర్వీసులు అందించనుంది. హెల్త్కేర్ సెక్టార్కు చెందిన వ్యక్తులు ఎంబసీ ప్రత్యేక లింక్ https://t.co/6GDOeTVrrw ద్వారా అపాయింట్మెంట్ పొంది, వారు కోరుకున్న సమయంలో సర్వీసులు పొందవచ్చని వెల్లడించింది. ఈ సందర్భంగా ఖతార్లో ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచడానికి మహమ్మారి సమయంలో కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్న భారతీయ ఆరోగ్య కార్యకర్తలకు ఇండియన్ ఎంబసీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.