భారతీయ వారసత్వ సంపద యోగా
ABN , First Publish Date - 2021-06-22T03:42:32+05:30 IST
యోగా భారతీయ వారసత్వ సంపద అని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ అన్నారు.
గూడూరురూరల్, జూన్ 21: యోగా భారతీయ వారసత్వ సంపద అని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ఏఏరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవాసంస్థ ఆధ్వర్యంలో యోగా మాస్టర్ కట్టా మురళీకృష్ణ సహకారంతో యోగా డే నిర్వహించారు. అనంతరం యోగా గురువు కట్టా మురళీకృష్ణను సన్మానించారు. కార్యక్రమంలో కడివేటి చంద్రశేఖర్, యమహా సుబ్రమణ్యం, కట్టా రాజ్కుమార్, ధనుంజయరెడ్డి, పొనకా మల్లికార్జునరెడ్డి, పూర్ణచంద్ర, ప్రభాకర్, డేగా సురేష్, కోట కృష్ణ, ప్రజేంద్రరెడ్డి, పిళ్లెల శ్రీనివాసులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరురూరల్: బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు, నందిమండలం రవీంద్రరాజు, బిందురెడ్డి, ఇండ్ల హేమచంద్ర, తదితర నాయకులు తమ నివాసాల వద్ద సోమవారం యోగాసనాలను వేశారు.
వెంకటగిరి(టౌన్): పట్టణంలోని విశ్వోదయ కళాశాల మైదానంలో బీజేపీ జిల్లా కన్వీనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు.