తెలివిగా వ్యవహరించిన భారతీయుడు.. నెటిజన్ల ప్రశంసలజల్లు!

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

కేరళ వ్యక్తికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు.. అతనిపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన జాఫర్ గత కొన్నేళ్లుగా దు

తెలివిగా వ్యవహరించిన భారతీయుడు.. నెటిజన్ల ప్రశంసలజల్లు!

దుబాయి: కేరళ వ్యక్తికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు.. అతనిపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన జాఫర్ గత కొన్నేళ్లుగా దుబాయిలో నివసిస్తున్నాడు. తాజాగా ఆయన దుబాయిలోని ఓ ప్రాంతాన్ని సందర్శించాడు. అదే సమయంలో అక్కడ ఓ దొంగతనం జరిగింది. దాదాపు రూ.80లక్షల సొత్తుతో దొంగ పరుగెడుతుండటాన్ని జాఫర్ గమనించాడు. ఈ క్రమంలో జాఫర్.. తెలివిగా వ్యవహరించాడు. కాలడ్డేసి దొంగను బోల్తాకొట్టించాడు. అనంతరం దొంగ నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకన్నాడు. అంతేకాకుండా.. ఆ డబ్బును తిరిగి దాని యజమానికి అప్పగించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. దీనిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. జాఫర్‌ను ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో జాఫర్ స్పందించాడు. ‘దొంగ వేగంగా పరిగెత్తుకొస్తున్నట్టు గమనించాను. అందుకే కేవలం నా కాలును అడ్డేశాను’ అని పేర్కొన్నాడు. 


Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST