బాల్టిక్‌లో ‘ఇంద్ర-2021’ ..రష్యా నేవీతో కలిసి భారత్‌ విన్యాసాలు

ABN , First Publish Date - 2021-07-31T09:19:15+05:30 IST

రష్యా నేవీతో కలిసి భారత నౌకాదళం బాల్టిక్‌ సముద్రంలో రెండు రోజులు ‘ఇంద్ర నేవీ-2021’ విన్యాసాలు చేసింది. ఇందులో భారత్‌ తరపున ఐఎన్‌ఎస్‌ తబర్‌ పాల్గొనగా, రష్యా నుంచి ఆర్‌ఎఫ్‌ఎస్‌ జిలోనై, ఒడినిత్సోవ్‌

బాల్టిక్‌లో ‘ఇంద్ర-2021’ ..రష్యా నేవీతో కలిసి భారత్‌ విన్యాసాలు

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రష్యా నేవీతో కలిసి భారత నౌకాదళం బాల్టిక్‌ సముద్రంలో రెండు రోజులు ‘ఇంద్ర నేవీ-2021’ విన్యాసాలు చేసింది. ఇందులో భారత్‌ తరపున ఐఎన్‌ఎస్‌ తబర్‌ పాల్గొనగా, రష్యా నుంచి ఆర్‌ఎఫ్‌ఎస్‌ జిలోనై, ఒడినిత్సోవ్‌ పాల్గొన్నాయి. దీర్ఘకాలిక వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో 2003 నుంచి ఈ విన్యాసాలు రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నట్టు భారత నౌకాదళం తెలిపింది. 

Updated Date - 2021-07-31T09:19:15+05:30 IST