నేవీలో ఉద్యోగాల పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-12-19T17:28:04+05:30 IST

సముద్రతీర రక్షణ దళంలో ఉద్యోగాలు తీసిస్తా మంటూ సుమారు 200 మంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన ముగ్గురిని సెంట్రల్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గౌరివాక్కంలో నివసిస్తున్న

నేవీలో ఉద్యోగాల పేరుతో మోసం

                - ముగ్గురి అరెస్టు


చెన్నై: సముద్రతీర రక్షణ దళంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 200 మంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన ముగ్గురిని సెంట్రల్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గౌరివాక్కంలో నివసిస్తున్న రాజేష్‌రఘురామ్‌, అతడి అనుచరులు స్వర్ణ సెంథిల్‌, హేమలత కలిసి సముద్ర తీర రక్షణ దళంలో ఉద్యోగాలు ఇపిస్తామని, అందుకు తామే ప్రత్యేక శిక్షణలను అందిస్తామంటూ నిరుద్యోగ యువకుల సెల్‌ఫోన్లకు సందేశాలు పంపారు. ఆ సందేశాలు చూసి సుమారు 200 మంది శిక్షణ కోసమని, ఉద్యోగనియామకపత్రం కోసం లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారు. ఈ మేరకు మాధవరానికి చెందిన సోమసుందరం వీరికి రూ.5లక్షలను చెల్లించి మోసపోయాడు. మాట ప్రకారం తనకు ఉద్యోగం తీసివ్వకపోవడంతో సోమసుందరం క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపినప్పుడు ఆ ముగ్గురు సుమారు రెండు కోట్లకు పైగా వసూలు చేసి మోసగించినట్టు కనుగొన్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Updated Date - 2021-12-19T17:28:04+05:30 IST