ఐవోఏ కమిటీకి జగదీశ్వర్‌ ఎంపిక

ABN , First Publish Date - 2020-05-28T08:54:20+05:30 IST

భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) స్పాన్సర్‌షిప్‌, మార్కెటింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ కమిటీ 2020-21కి తెలంగాణ ఒలింపిక్‌ సంఘం జనరల్...

ఐవోఏ కమిటీకి జగదీశ్వర్‌ ఎంపిక

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) స్పాన్సర్‌షిప్‌, మార్కెటింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ కమిటీ 2020-21కి  తెలంగాణ ఒలింపిక్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ జగదీశ్వర్‌ యాదవ్‌ నామినేట్‌ అయ్యారు. ఈ కమిటీ కోసం మొత్తం 11 మంది సభ్యులను ఐవోఏ అధ్యక్షుడు ఎంపిక చేశారు. ఐవోఏ కమిటీలో తెలంగాణ వ్యక్తికి స్థానం లభించడం ఇదే తొలిసారి. కొత్త ఆదాయ మార్గాలను వెదకడం, సలహాలు, సూచనలు ఇవ్వడంలో మార్కెటింగ్‌ కమిటీ సాయం చేయనుంది. 

Updated Date - 2020-05-28T08:54:20+05:30 IST