ఐవోఏ కమిటీకి జగదీశ్వర్ ఎంపిక
ABN , First Publish Date - 2020-05-28T08:54:20+05:30 IST
భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) స్పాన్సర్షిప్, మార్కెటింగ్, బ్రాడ్కాస్టింగ్ కమిటీ 2020-21కి తెలంగాణ ఒలింపిక్ సంఘం జనరల్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) స్పాన్సర్షిప్, మార్కెటింగ్, బ్రాడ్కాస్టింగ్ కమిటీ 2020-21కి తెలంగాణ ఒలింపిక్ సంఘం జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ నామినేట్ అయ్యారు. ఈ కమిటీ కోసం మొత్తం 11 మంది సభ్యులను ఐవోఏ అధ్యక్షుడు ఎంపిక చేశారు. ఐవోఏ కమిటీలో తెలంగాణ వ్యక్తికి స్థానం లభించడం ఇదే తొలిసారి. కొత్త ఆదాయ మార్గాలను వెదకడం, సలహాలు, సూచనలు ఇవ్వడంలో మార్కెటింగ్ కమిటీ సాయం చేయనుంది.