అమెరికాలో భారత సంతతి వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-04-17T04:52:06+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. మృతదేహం నదిలో కొట్టుకొని రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. మృతదేహం నదిలో కొట్టుకొని రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత మూలాలున్న 31ఏళ్ల షువ్రో బిస్వాస్ గణిత శాస్త్రజ్ఞుడిగా గుర్తింపు పొందారు. కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో.. ఆయన మృతదేహం న్యూయార్క్లోని హడ్సన్ నదిలో తేలుతూ కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. షువ్రో బిస్వాస్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.