భారత రాజకీయాలు అదుపు తప్పుతున్నాయా?

ABN , First Publish Date - 2021-07-25T01:34:19+05:30 IST

భారత రాజకీయాలు అదుపు తప్పుతున్నాయా?

భారత రాజకీయాలు అదుపు తప్పుతున్నాయా?

హైదరాబాద్: భారత రాజకీయాలు ఇప్పుడు గతి తప్పుతున్నాయా? లేక ఇంతకుముందే గతి తప్పిన రాజకీయాల్లో కొట్టుకుపోతున్నాయా అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. ప్రజలను వదిలేసిన ప్రజాస్వామ్యంలో భారత రాజకీయం, భారత ప్రజా తంత్రం తయారైందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు అధికారం కోసం చేయాలి. అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసం ప్రభుత్వాలు, అధికారం పనిచేయాలి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా రాజకీయాలు, పార్టీల కోసమే పని చేసుకుంటే ప్రజల కోసం ఎప్పుడు పని చేసేదనేది చాలా కీలక అంశంగా కనిపిస్తోంది. 


ఈ నేపథ్యంలో ‘‘భారత రాజకీయాలు అదుపు తప్పుతున్నాయా?. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు అవకాశం లేదా?. దేశంలోని పార్టీలు ప్రజతంత్రాన్ని  వీడి సాము చేస్తున్నాయా?. విద్వేషపూరిత రాజకీయాలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పుకాదా?. విద్యా-వైద్యాన్ని అందించలేని ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేస్తున్నాయి?. ధరలను అదుపు చేయలేని పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-07-25T01:34:19+05:30 IST