ఆరుగురు ఐఎస్ ఎల్ ఆటగాళ్లకు కరోనా
ABN , First Publish Date - 2020-09-24T09:04:19+05:30 IST
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్సఎల్) క్లబ్ జట్లకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. గోవాలోని బయోసెక్యూర్ బబుల్లో...
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్సఎల్) క్లబ్ జట్లకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. గోవాలోని బయోసెక్యూర్ బబుల్లో చేరకముందే డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, ఎఫ్సీ గోవా, హైదరాబాద్ ఎఫ్సీ ఆటగాళ్లు పాజిటివ్గా తేలారు. వీరిలో ఇద్దరు కోలుకోగా, మిగతా వారు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఐఎ్సఎల్ గోవాలో నవంబరులో మొదలవనుంది.