England బయల్దేరిన భారత జట్లు!

ABN , First Publish Date - 2021-06-03T22:22:43+05:30 IST

సుధీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల జట్లు బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బ‌య‌లుదేరాయి.

England బయల్దేరిన భారత జట్లు!

సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల జట్లు బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బ‌య‌లుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోట‌ల్‌లో క్వారంటైన్‌లో ఉన్న రెండు జ‌ట్లూ ఒకే విమానంలో పయనమయ్యాయి. బీసీసీఐ ఈ ఫొటోల‌ను ట్విట‌ర్‌లో షేర్ చేసింది. పురుషుల కెప్టెన్ కోహ్లి, మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్‌తోపాటు క్రికెటర్లందరూ బయల్దేరారు. 


సెల‌బ్రిటీ క‌పుల్ విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ త‌మ కూతురు వామిక‌తో క‌లిసి విమానాశ్రయం ద‌గ్గ‌ర ఉన్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. వామిక మొహం జర్నలిస్టుల కంటబడకుండా అనుష్క జాగ్రత్తలు తీసుకుంది. కోహ్లీ సేన న్యూజిలాండ్‌తో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌తోపాటు ఇంగ్లండ్ టీమ్‌తో ఐదు టెస్టులు ఆడ‌నుంది. అటు వుమెన్స్ టీమ్ ఇంగ్లండ్ మహిళల జట్టుతో ఒక టెస్టు, మూడు వ‌న్డేలు, మూడు టీ20ల్లో ఇంగ్లండ్ టీమ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. 



Updated Date - 2021-06-03T22:22:43+05:30 IST