బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్
ABN , First Publish Date - 2020-07-10T08:01:50+05:30 IST
దేశంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్ను బెంగళూరులో ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో అదిఅందుబాటులోకి రానుందని కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు...
- వారంలో అందుబాటులోకి 10,100 పడకలు: యడియూరప్ప
బెంగళూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : దేశంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్ను బెంగళూరులో ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో అదిఅందుబాటులోకి రానుందని కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. నగర శివారులో మాదవరకు అనుబంధమైన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఈ కేంద్రంలో 10,100 పడకలు ఉన్నాయని, 100 మంది బాఽఽధితులకు ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు సేవలు అందిస్తారని, ఇందుకోసమే 2,200 మందిని నియమిస్తున్నట్లు తెలిపారు.