కొత్త సాగు చట్టాలతో రైతులకు మేలే: ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్

ABN , First Publish Date - 2021-01-27T22:28:25+05:30 IST

భారత్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన సాగు చట్టాలతో రైతుల ఆదాయం పెరగొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ తెలిపారు.

కొత్త సాగు చట్టాలతో రైతులకు మేలే: ఐఎమ్ఎఫ్  చీఫ్ ఎకానమిస్ట్

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్త సాగు చట్టాలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆదాయం పెంచే శక్తి ఈ చట్టాలకు ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే.. రైతుల జీవికను కాపాడే వ్యవస్థలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. భారత వ్యవసాయ రంగంలో సంస్కరణల అవసరం ఉందని కూడా ఆమె స్పస్టం చేశారు. భారత్‌లో సాగు చట్టాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు గీతా గోపీనాథ్ ఈ మేరకు సమాధానమిచ్చారు.


 ‘ఈ సాగు చట్టాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించినవి. ఇవి రైతులకు అందుబాటులో ఉన్న మార్కెట్లను మరింత విస్తృత పరుస్తాయి. కేవలం వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా రైతులు తమ ఉత్పత్తులను అనేక మార్గాల్లో విక్రయించుకోవచ్చు.. అదీ కూడా ట్యాక్స్‌లు చెల్లించకుండానే..! ఈ విధానం ద్వారా రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ..సంస్కరణలు తీసుకొచ్చిన ప్రతిసారీ.. ఈ మార్పుకు సంబంధించి కొంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే.. దీని వల్ల బలహీన వర్గాలు నష్ట పోకుండా అప్రమత్తత వహించాలి. వారి జీవికకు భద్రత కల్పించే సామాజిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈ దిశగా ఇప్పటికే చర్చ మొదలైంది. దీని వల్ల ఏ ఫలితం వస్తుందో తెలుసుకునేందుకు వేచి చూడాలి.’ అని గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-27T22:28:25+05:30 IST