జనవరి 1నుంచి దేశవాళీ క్రికెట్‌

ABN , First Publish Date - 2020-10-18T09:21:33+05:30 IST

అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దేశవాళీ సీజన్‌ వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు

జనవరి 1నుంచి దేశవాళీ క్రికెట్‌

న్యూఢిల్లీ: అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దేశవాళీ సీజన్‌ వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ శనివారం వీడియో మాధ్యమంలో భేటీ అయింది. అనంతరం గంగూలీ మాట్లాడుతూ..దేశవాళీ పోటీల్లో రంజీ ట్రోఫీ పూర్తిస్థాయిలో జరుగుతుందన్నాడు. జూనియర్‌, మహిళా క్రికెట్‌ టోర్నీలను మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్టు తెలిపాడు. ఇక ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ సమయంలో భారత జట్టు సాధన చేస్తుందని చెప్పాడు. టీమిండియా పర్యటనకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా పంపిన వివరాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించామన్నాడు. ఆ పర్యటనలో భారత్‌ 4 టెస్ట్‌లు ఆడుతుందన్నాడు. 


Updated Date - 2020-10-18T09:21:33+05:30 IST