ఇండిగో విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా

ABN , First Publish Date - 2020-05-28T22:42:34+05:30 IST

ఇండిగో విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా

ఇండిగో విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది. బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో మదురై వెళ్తుండగా ఓ ప్రయాణికుడికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. కోవిడ్-19 లక్షణాలు లేనప్పటికీ ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సంస్థ తెలిపింది. మదురైలోని క్వారంటైన్ సెంటర్ లో ప్రయాణికుడికి కరోనా పరీక్షలు చేయగా.. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని ఎయిర్ లైన్స్ తెలిపింది. భారతదేశంలో సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఐదుగురు ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు మూడు వేర్వేరు విమానయాన సంస్థలు తెలిపాయి.


Updated Date - 2020-05-28T22:42:34+05:30 IST