నేడు భ్రామరికి పరోక్ష ఆర్జిత సేవ
ABN , First Publish Date - 2021-06-24T05:47:36+05:30 IST
శ్రీశైలక్షేత్రంలో గురువారం పౌర్ణమిని పురస్కరించుకొని భ్రమరాంబ అమ్మవారికి పరోక్షసేవగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.
శ్రీశైలం, జూన్ 23: శ్రీశైలక్షేత్రంలో గురువారం పౌర్ణమిని పురస్కరించుకొని భ్రమరాంబ అమ్మవారికి పరోక్షసేవగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. పూజలలో శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో పూజలలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్షసేవల ద్వారా అవకాశం కల్పించింది. ఈ సేవలో పాల్గొనేందుకు ఆన్లైన్ ద్వారా రూ. 1,116 చెల్లించాలని ఈవో తెలిపారు.