Indrakeeladri పై పెరిగిన భక్తుల రద్దీ..
ABN , First Publish Date - 2021-10-16T14:20:14+05:30 IST
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున్న తరలివస్తున్నారు. మరోవైపు భవానీ
రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున్న తరలివస్తున్నారు. మరోవైపు భవానీ భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో నేడు, రేపు ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. భవానీ భక్తులు పెరగడంతో ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతి ఇవ్వడం లేదు.