‘టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’

ABN , First Publish Date - 2021-09-29T22:05:15+05:30 IST

‘టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’

‘టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక పారదర్శకంగా నిర్వహించాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో ఉన్న  టీఆర్ఎస్ హోర్డింగ్స్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రచార పోస్టర్లను తొలగించాలని కోరామన్నారు. హుజురాబాద్ లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నిర్వహించే కుల సంఘాల సమావేశాలను సైతం పోలీసులే నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2021-09-29T22:05:15+05:30 IST