ఇందుపల్లిలో సచివాలయ భవనాలకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-05-17T06:27:34+05:30 IST

గ్రామ సచివాలయాల వ్యవస్థలను పటిష్ఠం చేసి సుపరిపాలన అందించటమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఇందుపల్లి గ్రామసర్పంచ్‌ బండి వెంకటలక్ష్మి అన్నారు.

ఇందుపల్లిలో సచివాలయ భవనాలకు శంకుస్థాపన

ఉంగుటూరు, మే 16 : గ్రామ సచివాలయాల వ్యవస్థలను పటిష్ఠం చేసి  సుపరిపాలన అందించటమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఇందుపల్లి గ్రామసర్పంచ్‌ బండి వెంకటలక్ష్మి అన్నారు.  ఇందుపల్లిలో సుమారు రూ.66 లక్షల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న నూతన సచివాలయం, ఆర్బీకే భవనాలకు ఆదివారం ఆమె భూమిపూజ చేశారు. పంచాయతీ కార్యదర్శి నర్రా ప్రసాద్‌ మాట్లాడుతూ సచివాలయ భవన నిర్మాణానికి రూ.40లక్షలు, రైతుభరోసాకేంద్రం నిర్మాణానికి రూ.22లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. కాంట్రాక్టర్‌ కూరాకుల తులసీరావుకి ఆయా భవనాల నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వార్డుసభ్యులు ఎం.వాణి, పి.గోవర్దన్‌, కె.రాజ్యలక్ష్మి, గ్రామపెద్దలు శేఖర్‌, వెంకట్రామయ్య, వలంటీర్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. మండలస్ధాయి అధికారులెవరూ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకాక పోవడం గమనార్హం. దీనిపై సెక్రటరీని వివరణకోరగా ఆదివారం సెలవుదినం కావటంతో ఉన్నతాధికారులను ఆహ్వానించలేదన్నారు.  

Updated Date - 2021-05-17T06:27:34+05:30 IST