క్వార్టర్స్లో సింధు, సాయి ప్రణీత్
ABN , First Publish Date - 2021-11-26T10:16:13+05:30 IST
ఇండోనేసియా ఓపెన్లో భారత ఏస్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్తోపాటు డబుల్స్లో సాత్విక్ జోడీ క్వార్టర్స్కు దూసుకెళ్లింది.
బాలి: ఇండోనేసియా ఓపెన్లో భారత ఏస్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్తోపాటు డబుల్స్లో సాత్విక్ జోడీ క్వార్టర్స్కు దూసుకెళ్లింది. అయితే, మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్స్లోనే ఓడాడు. రెండో రౌండ్లో సింధు 21-12, 21-18తో యెవన్నీ లీ (జర్మనీ)ని చిత్తు చేసింది. సాయి ప్రణీత్ 21-17, 14-21, 21-19తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గగా.. శ్రీకాంత్ 14-21, 18-21తో రెండో సీడ్ అక్సెల్సెన్ (డెన్మార్) చేతిలో ఓడాడు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ ద్వయం 21-15, 19-21, 23-21తో కొరియా జంట మిన్హ్యుక్-సియోపై పోరాడి గెలిచింది.