జూన్‌ 19 నుంచి సింధు మహాకుంభ్‌ మేళా

ABN , First Publish Date - 2021-04-11T08:46:42+05:30 IST

హిమాలయ పరివార్‌ సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 19 నుంచి 27 వరకు లద్దాఖ్‌ (లే్‌హ)లో సింధు మహాకుంభ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు.

జూన్‌ 19 నుంచి సింధు మహాకుంభ్‌ మేళా

బర్కత్‌పుర, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): హిమాలయ పరివార్‌ సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ 19 నుంచి 27 వరకు లద్దాఖ్‌ (లే్‌హ)లో సింధు మహాకుంభ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు. మేళాలో భాగంగా సింధు నది దర్శనం, సింధు ఘాట్‌ పూజ, సింధు ఉత్సవ మేళా, లేక్‌ దర్శనం, యోగా ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. మేళాలో పాల్గొనేవారు మే 15వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 9642827565 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-04-11T08:46:42+05:30 IST