టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకొచ్చాం: కేటీఆర్

ABN , First Publish Date - 2021-12-04T20:50:00+05:30 IST

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకొచ్చాం: కేటీఆర్

హైదరాబాద్: టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులిచ్చామని చెప్పారు. రాష్ట్రానికి రూ.2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2021-12-04T20:50:00+05:30 IST