మార్చిలో పారిశ్రామికం జోరు
ABN , First Publish Date - 2021-05-13T05:32:56+05:30 IST
దేశంలో పారిశ్రామికోత్పత్తి మార్చి నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చితో పోల్చితే పారిశ్రామికోత్పత్తి 22.4 శాతం పెరిగింది.
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామికోత్పత్తి మార్చి నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చితో పోల్చితే పారిశ్రామికోత్పత్తి 22.4 శాతం పెరిగింది. అయితే కొవిడ్-19 కన్నా ముందు కాలం నాటితో అనంతర కాలంలో వృద్ధిని సరిపోల్చలేమని గణాంకాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ధరల కాటుకు ఊరట: ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా నమోదయింది. మార్చి నెలలో ఇది 5.52 శాతం ఉంది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల రేటు మార్చితో పోల్చితే ఏప్రిల్ నెలలో 4.87 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గింది.