పెంచిన పెట్రో ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2021-06-18T04:48:14+05:30 IST
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాల ని డిమాండ్ చేస్తూ పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువా రం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
గాజువాక, జూన్ 17: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాల ని డిమాండ్ చేస్తూ పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువా రం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా టీడీపీ నగర ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పెంచిన పెట్రో ధరలతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని, దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో శ్రీని వాసరావు, అప్పారావు, సన్యాసమ్మ, రమణ, సోమినాయుడు పాల్గొన్నారు.