పెంచిన ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2022-04-04T06:14:30+05:30 IST
పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 3: పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరోనా నుంచి ప్రజలు తేరుకోకముందే ధరలు పెంచుతూ నడ్డి విరుస్తున్నారన్నారు. కుటుంబాలు గడవమే కష్టంగా మారిందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం విద్యు త్చార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అ లసత్వం చేయకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుతారి లక్ష్మన్, వి య్కుమార్, రాజయ్య, ఊట్ల కిరణ్ తదితరులున్నారు.