ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌

ABN , First Publish Date - 2021-02-24T04:41:25+05:30 IST

జిల్లాలో జేఈఈ మెయిన్స్‌ మం గళవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని విజయ్‌ రూరల్‌ ఇంజ నీరింగ్‌ కళాశాల, కాకతీయ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల, ఆర్మూర్‌లో ని క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహించారు.

ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌

నిజామాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 23: జిల్లాలో జేఈఈ మెయిన్స్‌ మం గళవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని విజయ్‌ రూరల్‌ ఇంజ నీరింగ్‌ కళాశాల, కాకతీయ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల, ఆర్మూర్‌లో ని క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహించారు. మంగళవారం రోజు 230 మంది విద్యార్థులకుగాను 204 మంది పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం నుంచి ఈ నెల 26 వరకు రెండు విడతల్లో ఉదయం, సాయంత్రం ఈ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు సిటీ కోఆర్డినేటర్‌ భాస్కర్‌ తెలిపారు. విజయ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జేఈఈ మేయిన్స్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్‌ సంపత్‌రావు తెలిపారు. 

Updated Date - 2021-02-24T04:41:25+05:30 IST