గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలోనే తగలబెట్టిన కిరాతకుడు.. సీసీకెమేరాకు చిక్కడంతో..

ABN , First Publish Date - 2021-06-13T02:19:05+05:30 IST

ఓ గొడవలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తిని ఆస్పత్రికి వచ్చి మరీ పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనమిది. మధ్య ప్రదేశ్‌లోని ..

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలోనే తగలబెట్టిన కిరాతకుడు.. సీసీకెమేరాకు చిక్కడంతో..

భోపాల్: గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తిని ఆస్పత్రికి వచ్చి మరీ పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనమిది. మధ్య ప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీని తాలూకు దృశ్యాలు సీసీ కెమేరాకి చిక్కడంతో.. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడిని దామోదర్ కోరీగా గుర్తించారు. ఈ ఘటనకు ముందు దామోదర్‌కి, నిందితుడు మిలాన్ మాచేకి గొడవ జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మిలాన్ చేతిలో తీవ్ర గాయాలు కావడంతో దామోదర్ స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేరాడు. అయితే అతడిని ఆస్పత్రి వరకు అనుసరిస్తూ వచ్చిన మిలాన్..  తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పటించి పారిపోయాడు. దీనికి ముందు మిలాన్ ఆస్పత్రిలో తచ్చాడుతున్న దృశ్యాలు, నిప్పంటించి పారిపోతున్న వైనం మొత్తం సీసీకెమేరాలో రికార్డ్ అయ్యింది. సీసీటీవీ ఫూటేజీ, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా మిలాన్ ఈ దారుణానికి పాల్పడినట్టు నిర్ధారణ అయ్యిందని సాగర్ జిల్లా ఏఎస్పీ విక్రమ్ కూష్వా పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-13T02:19:05+05:30 IST