రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-04T05:06:51+05:30 IST

మండలంలోని నారాయణపురం వద్ద గురువారం కారు స్కూటీని ఢీకొన్న ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రాంబిల్లి, నవంబరు 3 : మండలంలోని నారాయణపురం వద్ద గురువారం కారు స్కూటీని ఢీకొన్న ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ తెలిపారు. మూలకొత్తూరుకు చెందిన పి.దొరబాబు, అతని చెల్లెలితో కలిసి స్కూటీపై కొత్తూరు నుంచి ఎలమంచిలి వెళుతున్నాడు. నారాయణపురం వద్దకు వచ్చేసరికి ఎలమంచిలి నుంచి వస్తున్న కారు స్కూటీని ఢీకొంది. దీంతో  స్కూటీపై ఉన్న దొరబాబు, అతని చెల్లెలకు తీవ్రగాయాలైనట్టు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

Updated Date - 2020-12-04T05:06:51+05:30 IST