పోలీస్ రోడ్డు సేఫ్టీ వాహనాన్ని ఢీకొన్న వ్యాన్ ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2020-09-25T11:30:52+05:30 IST
పోలీస్ రోడ్డు సేఫ్టీ వాహనాన్ని ఢీకొన్న వ్యాన్ ఇద్దరికి గాయాలు
ఎంవీపీ కాలనీ, సెప్టెంబరు 24: మద్దిలపాలెం జాతీయ రహదారి టయోటో షోరూమ్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఆగివున్న పోలీస్ రోడ్డు సేఫ్టీ (ఆర్ఎస్-3) వాహనాన్ని తమిళనాడుకు చెందిన ఓ వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఎంవీపీ జోన్ పోలీసులు గురువారం కేసు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జాతీయ రహదారిపై ఆగివున్న ఆర్ఎస్-3 వాహనాన్ని ఇసుకతోట నుంచి మద్దిలపాలెం వైపు వెళుతున్న తమిళనాడుకు చెందిన (టీఎన్09సీఎం5538) వ్యాన్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్ఎస్-3 వాహనంలో ఉన్న హోంగార్డు, డ్రైవర్ శంకరరావు తలకు తీవ్ర గాయాలవ్వగా, హెడ్ కానిస్టేబుల్ ఆదిరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. తమిళనాడుకు చెందిన వాహనం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.