ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2021-02-25T05:17:15+05:30 IST
జనవరివలస వద్ద వేగంగా వచ్చిన ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటన బుధవారం చోటుచేసుకుంది
సాలూరు రూరల్, ఫిబ్రవరి 24: జనవరివలస వద్ద వేగంగా వచ్చిన ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముచ్చర్లకు చెందిన కోడి చినరాములు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం జనవరివలస వద్ద రోడ్డు దాటుతున్న బైక్ను సాలూరు నుంచి మామిడిపల్లి వైపు వెళ్తున్న ఆటో బలంగా ఢీ కొట్టి వెంటనే బోల్తా పడింది. ద్విచక్రవాహనంపై ఉన్న చినరాములు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చినట్టు క్షతగాత్రుని బంధువులు తెలిపారు. అయితే ఈ ఘటనలో బోల్తా పడిన ఆటోలో నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.