రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

ABN , First Publish Date - 2021-10-17T05:20:29+05:30 IST

కోవెలకుంట్ల బస్టాండు ప్రాంతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు


కోవెలకుంట్ల, అక్టోబరు 16: కోవెలకుంట్ల బస్టాండు ప్రాంతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. నంద్యాలకు చెందిన సువార్తమ్మ అనే మహిళ మండలంలోని పొట్టిపాడు గ్రామానికి వెళ్లి తిరిగి నంద్యాలకు వెళ్తుండగా బస్టాండు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో ఎడమ కాలుకు గాయాలయ్యాయి. సువార్తమ్మను ప్రైవేటు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించినట్లు బంధువులు తెలిపారు. 


Updated Date - 2021-10-17T05:20:29+05:30 IST